ఏపీ రాజధాని విషయంలో జగన్ మాటల్లో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో.. అమరావతిలో రాజధాని ఏర్పాటును మనస్పూర్తిగా స్వాగతిస్తున్నట్లు ఏకంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. ఇక ఇప్పుడు అధికారంలోకి వచ్చాక... సీఎం హోదాలో ఈ అంశంపై భిన్నంగా స్పందించారు. పరిస్థితులకు తగినట్లు మారాలంటూ మూడు రాజధానుల ప్రతిపాదన చేస్తున్నారు. నిధుల లేమిని కేపిటల్ నిర్మాణానికి సాకుగా చూపుతున్నారు.