రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. సీఎం కొవ్వొత్తుల ప్రదర్శన అనంతరం.. క్రిస్మస్ కేకు కట్ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ క్లుప్తంగా తన సందేశాన్ని ఇచ్చారు. క్రిస్మస్ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి షేక్ బేపారి అంజాద్ బాషా, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు.