మున్సిపోల్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీపడతాయి: గంగుల కమలాకర్

Update: 2019-12-25 12:56 GMT

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో క్లీన్‌ స్వీప్‌ చేస్తామన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో అభివృద్ధి పనులు కొనసాగాలంటే గులాబీ జెండా ఎగరాలని మంత్రి అన్నారు. కరీంనగర్‌ స్మార్ట్ సిటీ పనులను బీజేపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. కొత్తగా నిర్మించిన ఐటీ టవర్‌లో కార్యాలయాలు ఏర్పాటుకు 18 సంస్థలు ముందుకొచ్చాయని గంగుల చెప్పారు. మున్సిపోల్స్‌లో రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీజేపీ పోటీ పడతాయని ఎద్దేవా చేశారు.

Similar News