తెలుగు రాష్ట్రాల్లో జనం ఇప్పటికీ మూఢనమ్మకాలను పాటిస్తునే ఉన్నారు. గురువారం సూర్యగ్రహణం కావడంతో ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం బృందావనంలో రోలులో నీళ్లు పోసి రోకలి నిలబెట్టింది శిరీష అనే యువతి. ఎలాంటి ఆధారం లేకుండా రోకలి నిలబడటంతో సూర్య గ్రహణ ప్రభావంతో ఇది నిలబడిందని నమ్ముతున్నారు స్థానికులు. దీన్ని చూసేందుకు అక్కడి వచ్చారు స్థానికులు.