మేము సిద్ధంగా ఉన్నాం.. మీరు సిద్ధమా? నారాలోకేష్ సవాల్

Update: 2019-12-28 08:30 GMT

సీఎం జగన్‌పై ట్విట్టర్‌లో విమర్శలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. ఏడు నెలలుగా జగన్‌ గారు తవ్వుతోంది అవినీతి కాదని.. వైసీపీ ప్రభుత్వాన్ని పూడ్చిపెట్టాడనికి అని ఎద్దేవా చేశారు. ఆధారాలు బయటపెట్టమని అడుగుతుంటే జగన్‌ గారు అవే పాత లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో అమరావతి ప్రాంతంలో 1170 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని.. మరి 4 వేల 75 ఎకరాల ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందో... భ్రమల్లో బతుకుతున్న వైసీపీ నేతలు, ఉపసంఘం మేధావులు చెప్పాలని ప్రశ్నించారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ నివేదికపై లోకేష్‌ ఓపెన్‌ ఛాలెంజ్‌ చేశారు. జగన్‌ గారు ఆరోపిస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్‌ విచారణకు తాము సిద్ధమన్న లోకేష్‌.. అదే సమయంలో గత 7 నెలల కాలంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లో జరిగిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై జ్యుడీషియల్ ఎంక్వైరీకి వైసీపీ సిద్ధమా అని సవాల్‌ చేశారు.

Similar News