జనసేన విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. అన్ని ప్రాంతాలు, వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనే తాము కోరుకుంటున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ చెప్పారు. ఒకరికి న్యాయం చేసి మరొకరికి అన్యాయం చేయకూడదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున.. జిల్లాల వారీగా పరిస్థితులపై అభిప్రాయాలు చెప్పాలని పార్టీ నేతలను కోరారు.