హైదరాబాద్ షేక్పేట నాలా దగ్గర దర్గా సెంటర్లోని పెట్రోల్ బంక్లో ప్రమాదం కలకలం రేపింది. బంక్లోకి వచ్చిన ఓ కారులో ఉన్నట్టుండి మంటలు చెలరేగడంతో అంతా భయంతో పరుగులు తీశారు. కొద్ది క్షణాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. బంక్లోనే అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో.. వాటిని ఆర్పేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. బంక్ సిబ్బంది కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదం కారణంగా గచ్చిబౌలి నుంచి మెహదీపట్నం వేపు వెళ్లే ట్రాఫిక్ కాసేపు నిలిచిపోయింది. పెట్రోల్ బంక్లో ప్రమాదం కావడంతో ఎలాంటి దుర్ఘటన జరుగుతందోనన్న ఆందోళన అందరిలో కనిపించింది. ఫైరింజన్లు కూడా హుటాహుటిన స్పాట్కి బయలు దేరాయి. మరోవైపు పెట్రోల్ బంక్ ఎదుటే అనేక షోరూమ్లు ఉన్నాయి. మంటలను చూసి వారంతా భయపడి షాపులను మూసేసి పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు.