శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణ

Update: 2020-01-01 09:01 GMT

నూతన సంవత్సరం కూడా గ్రామాల్లో వర్గపోరు భగ్గుమంటూనే ఉంది. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపు తెంబూరు గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. ఈ దాడిలో టీడీపీకి చెందిన ఏడుగురికి గాయాలవగా, ఇద్దరు వైసీపీ వ్యక్తులకు దెబ్బలు తగిలాయి. పథకం ప్రకారమే వైసీపీ లీడర్లు కర్రలు, రాళ్లు సిద్ధం చేసుకుని తమపై దాడి చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా కాపుతెంబూరు గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

Similar News