రాజధాని తరలింపును నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టిన రోజురోజుకూ ఉధృతమవుతోంది. భూములు కోల్పోయి ఆవేదనలో ఉన్న తమకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు తుళ్లూరు మహిళలు, రైతులు లేఖలు రాశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ విజ్ఞప్తి చేశారు.