నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ సభ్యులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. జగన్ మనస్సు మారి మూడు రాజధానుల ఆలోచనను మానుకోవాలని కోరారు. అన్ని హంగులతో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.