అమరావతిపై సీఎం జగన్ యూటర్న్ తీసుకున్నారంటూ రాజధాని ప్రాంత రైతులు తీవ్రస్థాయిలో ఫైరవుతున్నారు.. రాజధానిపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.. అమరావతికి అప్పుడు ఒప్పుకున్న జగన్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని రాజధాని ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జగన్ గతంలో ఏం మాట్లాడారో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.