రాజధాని మార్పుపై అసెంబ్లీ వేదికగా YCP సభ్యులు అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి, BJP నేత రావెల కిషోర్బాబు మండిపడ్డారు. మైత్రి సంస్థ ద్వారా తాను భూములు కొన్నట్టు అసత్య ప్రచారం చేస్తున్న ఆర్థికమంత్రి బుగ్గనపై 10 కోట్లకు పరువునష్టం దావా వేస్తున్నట్టు తెలిపారు. దళితుడినైన తనను కించపరిచేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.