తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మరోసారి సమావేశం కానున్నారు. అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ నెల 13 న ఏపీ సీఎం జగన్.. తెలంగాణ సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ప్రగతి భవన్లో జరగనున్న ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల సీఎంల మధ్య పలు అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. ఏపీ రాజధాని మార్పుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్, జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.