అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న డిమాండ్తో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు.. అమరావతి పరిరక్షణ సమితి ప్రకటించింది. 25 పార్లమెంట్ స్థానాలను కలుపుతూ నిర్వహించనున్న బస్ యాత్రను చంద్రబాబు బుధవారం ప్రారంభించనున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు క్రెడాయ్ ఆధ్వర్యంలో గురువారం నుంచి భవన నిర్మాణ పనులను నిలిపివేస్తున్నామన్నారు.