అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో కృపానందం అనే రైతు మృతి చెందారు. ప్రభుత్వ నిర్ణయంతో మనోవేదనకు గురయ్యే తన తండ్రి మృతి చెందాడని అతడి కొడుకు ఆవేదన వ్యక్తం చేశాడు. అందరితో పాటు న్యాయం కోసం తన తండ్రి కూడా ఆందోళనల్లో పాల్గొన్నారని.. అయితే సోమవారం ధర్నాలో కూర్చొని ఉండగా పడిపోవడంతో.. భయపడ్డ రైతులు వెంటనే చికిత్స చేయించారన్నారు. అప్పటి నుంచి బాగానే కనిపించారని.. కానీ మంగళవారం అర్థరాత్రి సమయంలో మళ్లీ గుండెపోటు రావడంతో ఆస్ప్రత్రికి తరలించామని.. అప్పటికే మృతి చెందారని ఆయన కొడుకు ఆవేదన వ్యక్తం చేశారు.