అమరావతి రైతుల కోసం రంగంలోకి దిగనున్న పవన్ కల్యాణ్

Update: 2020-01-09 13:06 GMT

రాజధాని రైతుల కోసం రంగంలో దిగనున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అమరావతి పరరిక్షణ పేరుతో భారీ నిరసన కవాతు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలతో ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ సమావేశమై చర్చలు జరుపుతున్నారు. విజయవాడలో లక్షలాది మందితో నిరసన కవాతు చేయాలని భావిస్తున్నారు. అధినేత పవన్‌ కల్యాణ్‌తో సమావేశం తర్వాత తేదీ ప్రకటించనుంది జనసేన.

Similar News