అమరావతిలో మహిళలపై పోలీసుల దాడిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. శాంతియుతంగా దాడి చేస్తున్న మహిళలపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖాశర్మ. అమరావతి మహిళలకు అండగా ఉంటామని.. శనివారం నిజ నిర్ధారణ కమిటీని ఏపీకి పంపిస్తామని తెలిపారు రేఖా శర్మ.