ఆంధ్రప్రదేశ్ నగిరి నియోజక వర్గంలో తన గెలుపును ఎవరూ ఆపలేరంటున్నారు ఎమ్మెల్యే ఆర్ కే రోజా. జగన్ చేసిన పథకాలు వివరిస్తూ ప్రచారం స్పీడు పెంచారు. తనకు మరో అవకాశం ఇస్తే ఇంకా అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ లో నగిరికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా కృషి చేస్తానని మంత్రిరోజా అన్నారు.
జగనన్న చెప్పింది చేస్తారని, చేసేదే చెప్తారని రోజా అన్నారు. చంద్రబాబు అయితే చెప్పింది ఏనాడూ చెయ్యరని రోజా ఈ సందర్భంగా సైటర్లు వేశారు. గత ప్రభుతంలో అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఏం చేశారు? తరువాత ఇప్పుడు జగనన్న గడిచిన ఐదు ఏళ్లలో ఏం చేశారు? అని పోల్చుకుంటే సరిపోతుందని, ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారో ఇట్టే తెలిసిపోతుందని మంత్రిరోజా ఓ లాజిక్ చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దూరం అవుతుందని, పొరపాటున కూడా ఆ పార్టీకి ఓట్లు వెయ్యకూడదని మంత్రిరోజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. జగనన్న పాలనలో గొప్పగా జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోవాలంటే చంద్రబాబు పాలన, జగనన్న పాలనను పోల్చుకుంటే సరిపోతుందని ఈ సందర్భంగా రోజా పలికారు. సీఎం జగన్ బీసీలను ఆయన ప్రభుత్వంలో బ్యాక్ బోన్ గా చూసుకుంటారని, అదే చంద్రబాబు బీసీలను కులంగానే మాత్రమే గుర్తిస్తారని మంత్రిరోజా ఆరోపించారు.