ప్రజల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఏపీలో మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మగ పోలీసులతో మహిళలపై దాడి చేయిస్తారా అని ప్రశ్నించిన వర్ల... ఎమర్జెన్సీలో కూడా ఇంతటి ఘోరం జరగలేదన్నారు.