వైసీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా.. రాజధానితో రాజకీయం చేస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. అమరావతిని కాపాడండి అంటూ తెలుగు శక్తి ప్రతినిధులు మాధవ్ను కలిశారు. మూడు రాజధానుల ఫార్మాట్.. దక్షిణాఫ్రికాలో విఫలం అయిందని మాధవ్ గుర్తు చేశారు. ఏపీలోనూ ఫెయిల్ అవుతుందన్నారాయన. విశాఖ రాజధాని చేస్తే.. అమరావతి రైతులకు పట్టిన ఇబ్బందులే సాగరతీరంలోను ఎదురవుతాయని మాధవ్ అభిప్రాయపడ్డారు.