ఏటా సంక్రాంతి సమయంలో పోలీసుల ఆంక్షలు, హైకోర్టు ఆదేశాలు లాంటివి ఎన్ని ఉన్నా.. కోడిపందాలు జోరుగానే జరుగుతుంటాయి. ఈసారి కూడా ఇప్పటికే పందెం పుంజులు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఇప్పటికే అక్కడక్కడా పందాలు జరుగుతున్నా.. రేపు బోగి మంటలు వెయ్యగానే జోరు ఓ స్థాయికి వెళ్తుంది. ఇందుకోసం తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈసారి కూడా భారీ బరులు సిద్ధమయ్యాయి.