గుంటూరు జిల్లా జైలుకు వెళ్లిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. అక్కడ రైతులను పరామర్శించారు. హైవే దిగ్బంధం కేసులో పలువురు రైతులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా జైలులో లోకేష్ రైతులను పరామర్శించారు. లోకేష్ వెంట మాజీ మంత్రులు పుల్లారావు, ఎంపీ గల్లా జయదేవ్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.