రాజధాని తరలింపు నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడ బెంజ్ సర్కిల్లో టీడీపీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాజధాని అంశంపై జీఎన్ రావు కమిటీ, BCG ఇచ్చిన నివేదికలను, మూడు రాజధానుల ప్లకార్డులను భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని నినాదాలు చేశారు.