రాజధాని గ్రామాల్లో నిరసనలు 28వ రోజుకు చేరాయి. వెలగపూడిలో రిలే దీక్షల వద్ద ముగ్గులు వేసి రాజధాని మహిళలు నిరసన తెలిపారు. రాజధాని తరలించొద్దని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అటు.. మందడంలో ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ముగ్గులు వశారు. ఈ కార్యక్రమంలో మాగంటిబాబు కూడా పాల్గొన్నారు.