రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం ఎడ్ల పందాలకు వెళ్లడం సబబా?: మాగంటి బాబు

Update: 2020-01-15 07:08 GMT

మందడంలో రైతులకు దీక్షకు సంఘీభావం ప్రకటించారు టీడీపీ నేతలు మాగంటి బాబు, నన్నపనేని రాజకుమారి. రాజధాని కోసం మాగంటి బాబు లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. సీఎం చెప్పినట్టే కమిటీలు రిపోర్టులు ఇచ్చాయన్న మాగంటి బాబు.. రైతులు ఇబ్బందుల్లో ఉంటే సీఎం ఎడ్ల పందాలకు వెళ్లడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. అటు రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై నన్నపనేని రాజకుమారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News