ఏపీ సీఎం జగన్తో హైపవర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మంత్రి బుగ్గన నేతృత్వంలోని ఈ కమిటీ జీఎన్ రావు కమిటీ, బీసీజీ కమిటీ నివేదికలపై ఇప్పటికే మూడు సార్లు అధ్యయనం చేసింది. తొలి సమావేశంలోన రెండు కమిటీల నివేదికపై సూదీర్ఘంగా చర్చించింది. ఆ తరువాత రెండు, మూడో సమావేశాల్లో రాజధాని తరలింపు, రాజధాని ప్రాంత రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాల్లో అభివృద్ధికి సంబంధించి హైపవర్ కమిటీ చర్చించింది. తాము అధ్యయనం చేసిన అంశాలను పవర్ పాయింట్ ద్వారా సీఎం జగన్కు వివరిస్తున్నారు హైపవర్ కమిటీ సభ్యులు.