తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. నాలుగేళ్ల చిన్నారిపై ఇద్దరు మైనర్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో టూటౌన్ పోలీసులకు చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.