బీజేపీ - జనసేన కలయిక రాష్ట్రానికి మంచి చేస్తుందని ఎంపీ టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఈ కలయిక ఇరు పార్టీలకు లాభం చేకూరుస్తుందన్నారు. కర్నూల్కి హైకోర్టు ఇచ్చినంత మాత్రన.. మొత్తం రాయలసీమ బాగుపడుతుందా అని పవన్ ప్రశ్నించిన విధానాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పాలన వికేంద్రీకరణ పేరుతో రాయలసీమను దూరం చేయాలని చూస్తే.. నెల్లూరు, ప్రకాశం కలుపుకుని గ్రేటర్ రాయలసీమ పుట్టుకొస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు.