భూ సమస్యలను పైలట్ ప్రాజెక్ట్‌గా 15 రోజుల్లో పరిష్కరిస్తాం- మంత్రి కొప్పుల

Update: 2020-01-18 13:21 GMT

జగిత్యాల జిల్లా వెల్లటూర్‌ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ సమస్యల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పాల్గొన్నారు. ప్రజలు భూ సమస్యలను తీర్చడానికి కృషి చేస్తున్నామన్నారు. భూసమస్యలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా తీసుకుని 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు కొప్పుల ఈశ్వర్‌. మండల కేంద్రంలో.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేశారు. ఆ తర్వాత 13 మంది లబ్ధిదారులకు, కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్‌ చెక్కులను అందజేశారు.

 

Similar News