సిరిసిల్లలో ప్రచారం నిర్వహించిన మంత్రి కేటీఆర్

Update: 2020-01-18 14:19 GMT

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో ప్రచారం నిర్వహంచారు మంత్రి కేటీఆర్. తనకు రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లకు రుణపడి వుంటానన్నారు. సిరిసిల్ల అభివృద్ధికి పాటుపడిన టీఆర్ఎస్ నే గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేనేతల బతుకులు బాగుపడ్డాయన్నారు. టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు పార్టీ పేరుతో ప్రచారం చేస్తున్నారని.. వారిన నమ్మొద్దని అన్నారు. ఇది తన ఎలక్షన్ అనుకుని ఓటేయాలని.. అభివృద్ధి తన బాధ్యత అని తెలిపారు.

Similar News