రైతులు, ప్రజలందరూ భయాందోళనలు లేకుండా ఉద్యమంలో పాల్గొనాలి : అమరావతి జేఏసీ
అటు అమరావతి జేఏసీ సైతం రేపటి సమరానికి సిద్ధమైంది. ఉదయం ధర్నా చౌక్ నుంచి అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరుతామని జేఏసీ నేతలు వెల్లడించారు. ఉదయం తొమ్మిదిన్నరకు అసెంబ్లీ ముట్టడికి వెళ్తామని తెలిపారు. అరెస్టులకు సిద్ధంగా ఉన్నామని... రైతులు, ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలు లేకుండా ఉద్యమంలో పాల్గొనాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.