గత ప్రభుత్వం రైతుల నుంచి భూములు బలవంతంగా లాక్కుంది: ఆళ్ల రామకృష్ణా రెడ్డి
పరిపాలన వికేంద్రీకరణ బిల్లును సంపూర్ణంగా సమర్థిస్తున్నానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రాజధాని కోసం భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కుందని ఆరోపించారు. అమరావతి విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిన మాట వాస్తవమేనని అన్నారు. ఏపీ అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుందని సీఎం జగన్ ప్రకటించడం.. తమ అదృష్టంగా భావిస్తున్నట్టు ఆర్కే చెప్పారు.