ఎస్సీ, ఎస్టీలు దశాబ్దాలుగా అణగదొక్కబడ్డారని వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ అన్నారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై ఆయన చర్చ మొదలుపెట్టారు. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసమే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరిచారని వరప్రసాద్ గుర్తుచేశారు. వారి కోసం గత పాలకులు చేసిందేమీ లేదని అన్నారాయన.