గురువారం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని టీడీఎల్పీ నిర్ణయించింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశం కానున్నారు. మండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించడంపై విజయం సాధించడంతో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. అటు శాసనసభ, మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు, తమపై జరిగిన దౌర్జన్యంపై చర్చించనున్నారు. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఇప్పటికే గవర్నర్కు టీడీఎల్పీ ఫిర్యాదు చేసింది.