శాసనమండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం

Update: 2020-01-22 18:37 GMT

 

మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై మండలిలో ఉత్కంఠ పరిస్థితి కొనసాగుతోంది. బిల్లును ప్రవేశపెట్టే ముందే సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాల్సిందన్న మంత్రి బొత్స వాదనను టీడీపీ ఎమ్మెల్సీలు తప్పుబడుతున్నారు. రాజధాని విభజన బిల్లును బుధవారం సాయంత్రం 6 గంటలకు మండలిలో ప్రవేశపెడితే.. బుధవారం ఉదయమే బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపాలని నోటీసిచ్చామని టీడీపీ సభ్యులు చెబుతున్నారు. రాజధాని విభజన బిల్లుపై ఓటింగ్ జరిగే సమయంలో మంత్రులు మండలిలో ఉండరాదంటున్న టీడీపీ సభ్యులు.. వారిని బయటకు పంపాకే ఓటింగ్‌ జరపాలని ఛైర్మన్‌ను కోరుతున్నారు.

Similar News