ఏపీ సీఎం జగన్ తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను రద్దు చేస్తారా అని ప్రశ్నించారు. డమ్మీ కాన్వాయ్ నడిపే పరిస్థితి ఎందుకు వచ్చిందో అర్థం చేసుకోవాలని జగన్కు సూచించారు. ఆనాడు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని పునరుద్ధరిస్తే.. జగన్ ఇప్పుడు రద్దు చేస్తున్నారనంటూ విమర్శించారు రామకృష్ణ.