హిందూయిజం అంటే మతం కాదని భారతీయమని అన్నారు పవన్ కల్యాణ్. భవిష్యత్ తరాల కోసం త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపిచ్చారు. ఎక్కడ అన్యాయం జరిగినా కులం, మతం ప్రాతిపదనకన కాకుండా న్యాయం కోసం ప్రశ్నించాలని పిలుపిచ్చారు. దేశపౌరులంతా బాధ్యతతో ఉండాలన్నారు. మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు.