అసెంబ్లీని సీఎం జగన్ లోటస్ పాండ్లా మార్చారన్నారు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. కేంద్రం సహకరించకపోతే.. మండలి రద్దు జగన్ వల్ల కాదన్నారు. బీఏసీలో చర్చ లేకుండా సోమవారం అసెంబ్లీని ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించిన నిమ్మల.. సీఎం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభ పెట్టాలని ప్రభుత్వం చూస్తుందని ఆరోపించారు.