సీఎం జగన్కు ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్ కమిటీకి పంపడంపై తట్టుకోలేకనే మండలి రద్దుకు జగన్ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదు.. 5 కోట్ల ప్రజల మనోభావాలను అనుగుణంగా నడుచుకుంటున్నామన్నారు సత్యనారాయణ రాజు.