మాట మార్చిన బొత్స.. తుఫాను రాని నగరం ఉందా అంట..

Update: 2020-01-30 12:32 GMT

ఏపీ మంత్రి బొత్స సత్య నారాయణ మాటలకు అర్ధాలే వేరులే అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. గతంలో వరదల ప్రభావం ఎక్కువ ఉంటుందని.. అమరావతి రాజధానిగా పనికి రాదంటూ పదే పదే చెప్పారు. శివరామకృష్ణ కమిటీ కూడా అదే చెప్పిందని.. అందుకే రాజధానిని మార్చాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇప్పుడు జీఎన్‌ రావు కమిటీలోనూ విశాఖకు తుఫాను ముప్పు ఉందని చెప్పడంతో బొత్స మాట మార్చారు. తుఫాను రాని నగరం ఏదైనా ఉందా..? తుఫాను.. వరదలకు రాజధానితో లింకేంటని ప్రశ్నిస్తున్నారు.

Similar News