అమరావతి రైతులకు మద్దతు తెలిపితే.. నాపై కక్షసాధిస్తున్నారు: జేసీ దివాకర్ రెడ్డి

Update: 2020-02-01 18:33 GMT

రాజధాని కోసం ఆందోళన చేస్తున్న రైతులకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌ రెడ్డి సంఘీభావం తెలిపారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన ప్రతిసారి.. వ్యక్తిగతంగా తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని జేసీ విమర్శించారు. జగన్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని జేసీ దివాకర్‌ రెడ్డి తెలిపారు.

Similar News