అమరావతి గళాన్ని కేంద్రానికి వినిపించేందుకు ఢిల్లీ వెళ్లిన... రాజధాని రైతులు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్రెడ్డితో భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్రమంత్రుల అపాయింట్మెంట్లు కూడా కోరారు. అమరావతి పరిస్థితితో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కేంద్రానికి వివరించి తగిన న్యాయం చేయాలని కోరుతామని జేఏసీ నేతలు వెల్లడించారు.