రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో స్పందిస్తుందని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.
త్వరలోనే రాష్ట్ర నాయకత్వం రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతుందన్నారు. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదని.. రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి.. రాజధాని తరలింపు సీఎం వల్ల కాదని కామినేని శ్రీనివాస్ చెప్పారు.