విజయనగరం రైల్వేస్టేషన్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో కలకలం రేగింది. దీంతో పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ అంతటా గాలించారు. అనుమానితులను ప్రశ్నించి సీసీ కెమెరాలను పరిశీలించారు. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.