అమరావతి పోరాటంలో మరో గుండె అలసిపోయింది. మందడంలో షేక్ జానీ అనే రైతుకూలీ గుండెపోటుతో మరణించాడు. అమరావతి ఉద్యమంలో నిన్నటిదాకా చురుగ్గా పాల్గొన్నారాయన. ప్రభుత్వ వైఖరితో మనోవేదనకు గురైనట్టు జానీ కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని తరలిస్తే.. తమ భవిష్యత్ ఏంటని.. తరచూ అంటుండే వాడని చెబుతున్నారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు, రైతు కూలీల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని వాపోతున్నారు.