గోల్కొండ రాజులకు సామంతుడిలా జగన్ పనిచేస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. సాగునీటి నిపుణులు చెప్పిన మాట కూడా వినిపించుకునే పరిస్థితిలో ఆయన లేరన్నారు. ఇంజినీర్ జగన్ అంటూ సెటైర్లు వేశారు. గోదావరి-పెన్నా అనుసంధానానికి టీడీపీ క్లియర్ చేస్తే ఇప్పుడు సొంత నిర్ణయాలతో రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.