దేశ రాజధానిలో అమరావతి రైతుల పర్యటన బిజీగా కొనసాగుతోంది. అమరావతి కోసం ఢిల్లీ పెద్దలను కలుస్తున్న రాజధాని రైతులకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ లభించింది. శుక్రవారం ఉదయం పది గంటలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసి రాజధాని తరలింపుపై చర్య తీసుకోవాలని కోరనున్నారు. వీలంతైనమంది కేంద్ర పెద్దలను కలిసి.. తమ బాధను వినిపిస్తామంటున్నారు రాజధాని రైతులు. కేంద్రం నుంచి రాజధానిగా అమరావతి కొనసాగింపుపై స్పష్టమైన హామీ తీసుకున్న తరువాతే ఢీల్లీ వీడుతామని స్పష్టం చేశారు.