అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట దేశంలో ఎక్కడా లేవు: మాజీ ఎంపీ ఉండవల్లి
మూడు రాజధానుల అంశంలో తానేమీ చెప్పలేకపోతున్నానన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. అసెంబ్లీ ఒక చోట, సచివాలయం ఒక చోట దేశంలో ఎక్కడా లేవని అన్నారు. అమరావతికి భూములిచ్చిన రైతులు చేసింది రియల్ ఎస్టేట్ వ్యాపారమని తాను గతంలోనే చెప్పానన్నారు. జగన్ ఇప్పటికైనా పోలవరం, ప్రత్యేక హోదాపై దృష్టి పెడితే మంచిదని సూచించారు ఉండవల్లి.