వైసీపీ నాయకులంతా జిల్లాలకు జిల్లాలు మింగేస్తున్నారు: పంచుమర్తి అనురాధ

Update: 2020-02-05 20:06 GMT

రాజధాని రైతులు 50 రోజులుగా ఉద్యమాలు చేస్తున్న సీఎం జగన్ స్పందించకపోవడం బాధాకరమన్నారు టీడీపీ నేత పంచుమర్తి అనురాధ. మంగళవారం ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి సీఎంను కలిసిన వారంతా ఆయన బంధువులేనని ఆరోపించారు. కులాలు, మతాలతో ఫుట్‌బాల్ ఆడుకునే వ్యక్తి జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులంతా కలిసి జిల్లాలకు జిల్లాలను మింగేస్తున్నారని మండిపడ్డారు అనురాధ. విజయసాయిరెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేశారామె.

Similar News