హైదరాబాద్లో లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ విద్యార్ధి మృతిచెందాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద కాలేజీకి వెళ్తుండగా గుంటి అజయ్, గుంటి రవిలను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితులు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు చెందిన వారిగా గుర్తించారు. వీరు రామ్నగర్లోని పయనీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంగ్ కాలేజ్లో చదువుతున్నారు.